కేంద్రమంత్రికి అవమానం..
ఆర్.బి.ఎం మెదక్: జిల్లాలో కేంద్రమంత్రికి అవమానం జరిగింది. కేంద్రమంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్ మెదక్ జిల్లాలో పర్యటించారు. శనివారం ఉదయం కేంద్రమంత్రి గెస్ట్హౌజ్కు వచ్చినప్పటీకీ ఆర్అండ్బీ అధికారులు తాళం తీయలేదు. దీంతో ఆగ్రహానికి గురైన బీజేపీ నేతలు తాళం పగలకొట్టి సంజీవ్ కుమార్ను గెస్ట్ హౌజ్లోకి తీసుకెళ్లారు. గెస్ట్హౌజ్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. దీంతో కనీసం నీళ్లు కూడా అందుబాటులో ఉంచలేదు. ప్రోటోకాల్ పాటించని ఆర్అండ్బీ అధికారులపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కేంద్రమంత్రిని గౌరవించాలన్న మర్యాద కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.