మానవత్వాన్ని చాటుకున్న పోలీసులు..
ఆర్.బి.ఎం హైదరాబాద్: పోలీసులు కఠినంగా ఉంటారని అందరి అభిప్రాయం. అందరూ అనుకున్నట్టే వారి చుట్టూ ఎప్పుడు వివాదాలే. అయితే అప్పుడప్పుడు పోలీసులు మానవత్వం ప్రదర్శిస్తూ అందరి మన్ననలు అందుకుంటారు. ఇలాగే వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. తండ్రి లేని చిన్నారికి రూ.45వేలు ఫిక్సడ్ డిపాజిట్ చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పద్మమ్మ అనే మహిళ స్వీపర్గా పని చేస్తోంది. ఆమె కూతురు నాగమణి భర్త మహేందర్ ఇటీవల గుండెపోటుతో మరణించాడు. భర్త చనిపోవడంతో నాగమణిపై కుటుంబ భారం పడింది. దీన్ని గమనించిన ఇన్స్పెక్టర్లు లక్ష్మీకాంత్తో పాటు ఇతర సిబ్బంది.. నాగమణి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని భావించారు. అనుకున్నట్లే పోలీసులంతా కలిసి రూ.45వేలు జమచేశారు. పద్మమ్మ మనువరాలు కావ్య పేరిట ఫిక్సడ్ డిపాజిట్ చేశారు. పోలీసుల చేసిన సాయాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. శభాష్ పోలీసులంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.