సైదాబాద్ ఘటన మరవకముందే సంగారెడ్డి జిల్లాలో ఘోరం.. ఇద్దరు యువకులు మైనర్ బాలికను బైక్ పై తీసుకెళ్లి..
ఆర్.బి.ఎం సంగారెడ్డి: మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చిన వారికి రక్షణ లేకుండా పోతోంది. కొన్ని ఘటనల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. మహిళలకు రక్షణ కల్పించడంలో పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందనే ప్రచారం ఉంది. సైదాబాద్ చిన్నారి ఘటన మరువకముందే సగ్గారెడ్డి జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది . జిల్లాకు చెందిన సాయి, నాగేష్ అనే యువకులు బాలికపై అత్యాచారానికి యత్నించారు. స్థానికులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. సదరు బాలికను గణేష్ విగ్రహాలను చూపిస్తామని యువకులు బైక్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. కొంత దూరం వెళ్లాక బాలిక భయంతో కేకలు వేసింది. అటుగా వెళ్తున్న వాహనదారులు బాలిక కేకలు వేయడంతో అక్కడి చేరుకున్నారు. జరిగిన ఘటనను బాలిక వాహనాదారులకు చెప్పడంతో యువకులకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. తనను ఇంటికి తీసుకెళ్లానని సాయి, నాగేష్ల కాళ్లు పట్టుకున్నానని బాలిక తెలిపింది. అయినా తనపై అత్యాచారం చేయబోయారని వాపోయింది. బాలికను రక్షించిన వాహనదారులు బాలిక తల్లిదండ్రలకు సమాచారం ఇచ్చారు.