పసల్ వాదిలో కారు భీభత్సం.. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు..
ఆర్.బి.ఎం సంగారెడ్డి,పసల్ వాది: కారు అతివేగంతో భీభత్సం సృష్టించిన సంఘటన సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని పసల్ వాది గ్రామంలో చోటుచేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని పసల్ వాది గ్రామానికి చెందిన కాలేపల్లి దశరత్ ఈరోజు సాయంత్రం (గురువారం) సమయంలో దిగంబర గుడి పక్కనబైక్ పై వెళ్తున్న క్రమంలో ఎదురుగా అతివేగంగా కారు రావడం గమనించి ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఆ కారు అతన్ని అతివేగంగా వచ్చి ఢీకొట్టింది.
దింతో కాలేపల్లి దశరత్ కు తీవ్ర గాయాలయ్యాయి. దశరత్ పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఆక్సిడెంట్ చేసిన కారు డ్రైవర్ ఘటన ప్రాంతం నుండి పరారైయ్యాడు. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.