బీజేపీ,కాంగ్రెస్ అనైతిక పొత్తు బయటపడింది: ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే

బీజేపీ,కాంగ్రెస్ అనైతిక పొత్తు బయటపడింది: ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే

ఆర్.బి.ఎం రాజేంద్రనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపుపై రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పందించారు.

ఈ సందర్భంగా ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ తాము గెలిచిన నాడు ఎగరమని ఓడిన నాడు ఇరగం అని ఓడిన, గెలిచిన ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తామని ఆయన అన్నారు. ఒక్కసారి పడితే వందసార్లు లేస్తం నిక్కర్సైన గులాబొల్లామ్ అని ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు.

బీజేపీ,కాంగ్రెస్ అనైతిక పొత్తు బయటపడిందన్నారు. తెలంగాణ అభివృద్ది కోసం ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తెరాస పార్టీని ఓడించడానికి రెండు జాతీయ పార్టీలు ఒక్కటైయయని ప్రకాష్  గౌడ్ ఈ సందర్భంగా అన్నారు.

Leave a Reply

Your email address will not be published.