శంకర్ పల్లికి మరిన్ని అదనపు బస్సులు..
ఆర్.బి.ఎం శంకర్ పల్లి: సంగారెడ్డి డిపో నుండి శంకర్ పల్లికి ఆర్టీసీ అధికారులు మరిన్ని అదనపు బస్సులను నడపనున్నారు. సంగారెడ్డి కాశీపూర్ జుల్కల్ ఎద్దుమైలారం శంకర్ పల్లి విద్యార్థులను ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని అదనపు బస్సులు నడుపుతున్నామని అధికారులు తెలిపారు. కాగా ప్రతి ఒక్కరు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.