రైతులకు వార్నింగ్ ఇచ్చిన సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణ కుమార్..
ఆర్.బి.ఎం సంగారెడ్డి: రైతులు తాము పండించిన ధాన్యాన్ని రహదారులపై ఆరబోయడం, ధాన్యం చుట్టూ రాళ్లు పేర్చడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం కొన్ని సందర్భాల్లో అతి వేగంగా వచ్చే వాహనదారులు వాటిని గమనించక పోవటంతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణ కుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో రైతులు తమ ధాన్యాన్ని రహదారులపై వేయకూడదని ఎస్పీ రమణ కుమార్ తెలిపారు. రైతులు దీనికి సహకరించాలని అయన కోరారు. రహదారులపై ధాన్యం ఆరబోయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగితే దానికి సంభందించిన రైతులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని శుక్రవారం ఓ ప్రకటనలో ఎస్పీ రమణ రైతులకు హెచ్చరికలు జారీచేశారు.