సంగారెడ్డి జిల్లాలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి…

సంగారెడ్డి జిల్లాలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి…

ఆర్.బి.ఎం సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో నిండు కుటుంభం బలి.

మృతులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ mig (bhel ) కాలనిలో భర్త చంద్రకాంత్ భార్య లావణ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. లావణ్య తన భర్త చంద్రకాంత్ తో నిన్న (గురువారం) సాయంత్రం గొడవపడి తన ఇద్దరి పిల్లలను తన వెంట తీసుకొని బయటికి వెళ్ళిపోయింది.

కాగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ పెద్ద చెరువులో లావణ్య తన ఇద్దరి పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారం తో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. చిన్నారి కోసం చెరువులో పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలావుండగా లావణ్య భర్త చంద్రకాంత్ నిన్న(సాయంత్రం) ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు సమాచారం.

వీరి ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే అని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.