17వ రోజు ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొన్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం కోఆర్డినేటర్ సందీప్ రెడ్డి..

17వ రోజు ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొన్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం కోఆర్డినేటర్ సందీప్ రెడ్డి..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్ : 17 వ రోజుకు చేరుకున్న వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర. ఈ పాదయాత్రలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం కోఆర్డినేటర్ సందీప్ రెడ్డి అధినేత్రి షర్మిలతో పాటు నడిచారు.

ఈ సందర్బంగా ఏనుగుల సందీప్ రెడ్డి ఆర్.బి.ఎం మీడియాతో మాట్లాడుతు ఈ రోజు దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో ప్రజా ప్రస్థానం పాదయాత్ర జరిగిందన్నారు. చలిని, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం తమ అధినేత్రి షర్మిల పాదయాత్ర చేస్తోందని ఏనుగుల సందీప్ రెడ్డి అన్నారు. తమ అధినేత్రి ప్రజల కోసం చేస్తున్న ప్రజా ప్రస్థానం పాదయాత్రను చూసి కెసిఆర్ కుటుంబానికి భయం పుట్టుకుందన్నారు. గ్రామాల్లోకి వెళ్తున్న షర్మిలకు ప్రజలు అడుగడుగునా హారతులు పడుతూ బ్రమ్మరథం పడుతున్నారని ఏనుగుల సందీప్ రెడ్డి తెలిపారు.

బంగారు తెలంగాణ అని కెసిఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. అసలైన బంగారు తెలంగాణ తమ అధినేత్రితోనే సాధ్యమౌతుందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలో వస్తుందని రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టడానికే కెసిఆర్ ప్రభుత్వం పథకాలు ప్రవేశ పెడుతుందని ఇలా ప్రజలను మోసం చేయడం మంచింది కాదని ఏనుగుల సందీప్ రెడ్డి మండిపడ్డారు. కెసిఆర్ నియంత పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అయన అన్నారు. తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఆస్తులు అమ్ముకొని కస్టపడి ఉన్నతమైన చదువులు చదివి తీరా ఉద్యోగాలు రాకపోవడంతో విద్యార్థులు ఆత్మ హత్యలు చేసుకుంటూ పిట్టల రాలిపోతున్నారని ఇంత జరుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి కండ్లు కనిపిస్తలేవా విద్యార్థులు ఉసురు కెసిఆర్ కు తగులుతుందని ఏనుగుల సందీప్ రెడ్డి మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published.