దాదాపుర్ గ్రామంలో యువకుడి ఆత్మహత్య..
ఆర్.బి.ఎం: వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని వ్యక్తి వంటికి నిప్పంటించుకొని మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ పరిధిలోని దాదాపుర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చాకలి శివ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో నుండి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మంటలకు తాళలేక గట్టిగా అరిచాడు వెంటనే స్థానికులు చాకలి శివ కుమార్ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేలోపే మార్గమధ్యంలో మృతి చెందాడు.