రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవంకు వచ్చిన కాషాయ శ్రేణుల కార్యకర్తల ఫై లాఠీ ఛార్జ్
రామగుండం : పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ రానుండగా రామగుండం బీజేపీ కాషాయ శ్రేణుల కార్యకర్తలు బారి బహిరంగ సభకు ఏర్పాట్లు సిద్ధం చేయగా .ఈ కార్యక్రమానికి వికిషించడానికి కాషాయ శ్రేణుల బీజేపీ కార్యకర్తలు వివిధ జిల్లా మండలాల నుండి విచేస్తుండగా అటుగా సభ ప్రాగణానికి వెళ్తున్న కొంతమంది బీజేపీ కాషాయ కార్యకర్తులని భారత ఆహార సంస్థ క్రాస్ రోడ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు ఇదేంటి సర్ అని ప్రశ్నించగా అక్కడేఉన్న ఒక రాంక్ హోదాలో ఉన్నఅధికారి డీస్పీ రఘు కార్యకర్తలపై లాఠీచార్జి చేసారు .ఈ లాఠీ ఛార్జ్ లో సభకు వచ్చిన ఇద్దరు కార్యకర్తలకు గాయాలు కావడం తో అక్కడిఅక్కడే కాషాయ శ్రేణులు రోడ్ ఫై బైఠాయించి నిరసన వక్తం చేశారు పోలీసులు వారికీ ఇష్టం వచ్చినట్లు అసభ్యకరంగా మాటలు వదిలేస్తూ కొట్టారు అని తెలిపారు .వెంటనే ఆ పోలీస్అధికారి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా చెప్పనీయడల డీజీపీ ఆఫీస్ ఎదుట నిరసన ఆందోళన చేస్తామని తెలిపారు.