సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాసిన విద్యార్థిని..
ఆర్.బి.ఎం డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ చిన్నారి రాసి పంపిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆధిబట్లకు చెందిన అంజలి విద్యార్థిని లేఖలో తన సందేశాన్ని రేవంత్ రెడ్డికి పంపింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రికి నమస్కరించి వ్రాయునది ఏమనగా, సీఎంగా మీరు ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని దయచేసి మా ప్రభుత్వ స్కూలుకు ఉచిత విద్యుత్ అందించాలని మనవి అని ఆ చిన్నారి లేఖలో రాసుకొచ్చింది.