సీఎం రేవంత్ రెడ్డికి ఓఎస్డి గా అజిత్ రెడ్డి నియామకం
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డీగా బి అజిత్ రెడ్డిని ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసెస్కు చెందిన అజిత్ రెడ్డి ఐదేళ్ల పాటు డిప్యుటేషన్పై రాష్ట్ర ప్రభుత్వంలో పని చేయనున్నారు. అజిత్ రెడ్డిని ఓఎస్డీ గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అయన గతంలో ఆగ్రా, సికింద్రాబాద్ కంటోన్మెట్ బోర్డుల్లో పనిచేశారు. అజిత్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరులో అదనపు డిఫెన్స్ ఎస్టేట్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.