సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి..
ఆర్.బి.ఎం: సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 4వ తేదీన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శరత్ ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు. ఉదయం 10: ౩౦ నుండి మధ్యాహ్నం 1 : 30 గంటల వరకు జిల్లా స్థాయి ఉన్నత అధికారులు స్వయంగా ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు. సమస్యలను అధికారులు అక్కడికక్కడే పరిష్కరిస్తారని ఈ సందర్బంగా కలెక్టర్ వివరించారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శరత్ కోరారు.