సిగరేట్ కోసం కత్తితో పొడిచారు.!
ఆర్.బి.ఎం డెస్క్ : సిగరేట్ కోసం యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన అలసయంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే విజయనగర్ కాలనీకి చెందిన మహబూబ్ (22) గత నెల 31 బంజారాహిల్స్లోని బంధువుల ఇంటికి వెళ్ళాడు. కాగా రాత్రి అతని వాహనంపై స్థానిక యువకులు బబ్లూ, వెంకట్ కూర్చుని సిగరేట్ తీసుకురావాలని మహబూబ్క చెప్పగా అతను నిరాకరించాడు. దింతో ఆగ్రహించిన ఆ యువకులు అతనిని కత్తితో అతి కిరాతకంగా పొడిచారు. బాధితుడు పోలీసులకు పిర్యాదు చేయడంతో శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు.