అర్హులకు రేషన్ కార్డులు అందించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: రాజేంద్రనగర్ నియోజకవర్గం హైదరుగుడాలోని సామభూపాల్ రెడ్డి ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు రేషన్ కార్డ్స్ పంపిణీ చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అన్నార్తుల ఆకలి తీర్చలనే గొప్ప ఉధ్యేశంతో సీఎం కెసిఆర్ అర్హులైన పేదలకు రేషన్ కార్డ్స్ మంజూరు చేశారు అని అయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలు ఉపయోగించు కోవాలన్నారు రేషన్ కార్డులు లేని వారందరు అప్లయ్ చేసుకోవాలని ప్రకాష్ గౌడ్ కోరారు. ఈ క్రమంలో నిరంతరం పేదల అభివృద్ధికి కోసం పాటు పడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపిన ప్రకాష్ గౌడ్. ఈ కార్యక్రమంలో జడ్పీఛైర్పేసన్ అనిత రెడ్డి ,Rdo చంద్ర కళ ,సివిల్ సప్లై అధికారులు, స్థనిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.