కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ పథకాలు పేదలకు వరం: గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే
ఆర్.బి.ఎం, సంగారెడ్డి,పటాన్చెరు,క్యాసారం : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆడపిల్లలు పుట్టే తల్లిదండ్రులకు ఒక వరం అని పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఈ రోజు (సోమవారం) పటాన్చెరు నియోజకవర్గంలోని జి.ఎం.ఆర్ ఫంక్షన్ హాల్ లో లబ్ది దారులకు అయన చెక్కులు పంపిణి చేశారు.ఈ పథకం ద్వారా బాలికల వివాహానికి ప్రభుత్వం రూ .1,00,116 అందిస్తుందని మహిళపల్ రెడ్డి తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గం క్యాసారం గ్రామా తెరాస పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేద ప్రజల ప్రయోజనాల కోసం ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు అభినందనలు తెలిపారు. ఈ పథకం బలహీన వర్గాల ప్రజలకు ఉపశమనం కలిగించిందని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజల స్పందన చూసిన తరువాత ముఖ్యమంత్రి కొన్ని సంవత్సరాలలో రూ .50,116 నుండి 1,00,116 రూపాయలకు పెంచారు అని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇటువంటి పథకాలను ప్రతిబింబించడానికి అనేక రాష్ట్రాలు టిఆర్ఎస్ ప్రభుత్వం నుండి ప్రేరణ పొందుతున్నాయని చెప్పారు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. క్యాసారం గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి.కొత్త రేషన్ కార్డులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో క్యాసారం ఉప సర్పంచ్ విక్రమ్ రెడ్డి, వార్డు మెంబర్ ఈశ్వర్ యాదవ్,ఇంద్రజ దశరథ్ యాదవ్ పాల్గొన్నారు.