బడుగుల ఆశాజ్యోతి డా.బాబు జగజ్జీవన్ రామ్: ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే

బడుగుల ఆశాజ్యోతి డా.బాబు జగజ్జీవన్ రామ్: ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే

రాజేంద్రనగర్ నియోజకవర్గం బుద్వెల్ జంక్షన్ లో ఘనంగా డా బాబు జగజ్జీవన్ రామ్ 115 జయంతి వేడుకలు..

ఆర్.బి.ఎం రాజేంద్రనగర్: అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రామ్ అని ప్రకాశ్ గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం బుద్వెల్ జంక్షన్ లో డా. బాబు జగజ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రకాష్ గౌడ్ నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో జన్మించి భారత దేశ ఉపప్రదానిగా పదవి చేపట్టి దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పారన్నారు. ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడుగా, సంఘ సంస్కర్తగా డా.బాబు జగజ్జీవన్ రాం పేరొందన్నారు. వారి అడుగు జాడల్లో నడచి వారి ఆశయ సాధనకు కృషి చేద్దామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే రత్నం , తెరాస డివిజన్ పార్టీ అధ్యక్షుడు ధర్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేష్, సుభాష్ రెడ్డి, శ్రవణ్, రవీందర్, దేవదాస్, శివ, రఘు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.