రాజేంద్రనగర్లో రెండు ఆవులపై చిరుత దాడి.. భయాందోళనలో స్థానికులు
రంగారెడ్డి, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ పరిథిలోని వలంతరి రైస్ రీసెర్చ్ సెంటర్ సమీపంలో చిరుత సంచరిస్తున్నటు స్థానికులు తెలిపారు. కొద్దీ రోజుల నుండి రాజేంద్రనగర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో చిరుత తిరుగుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాజేంద్రనగర్ లో చిరుత కనిపించిన నుండి ఇప్పటి వరకు ఫారెస్ట్ సిబ్బంది చిరుత కోసం ముమ్మరంగా గాలింపు చెర్యలు చేపట్టారు అయిన లభ్యం కానీ చిరుత జాడ. తాజాగా రాజేంద్రనగర్ యూనివర్సిటీ పరిధిలో నిన్న రాత్రి వేళలో చిరుత రెండు లేగ దూడలపై దాడి చేసి చంపిందని స్థానికులు తెలిపారు. స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులుకు , ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్నికి చేరుకొని చనిపోయిన దూడలను పరిశీలించారు. రాజేంద్రనగర్ ప్రాంత ప్రజలు అప్రమతంగా ఉండాలని అధికారులు సూచించారు.