పులుసుమామిడి వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి..

పులుసుమామిడి వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి..

ఆర్.బి.ఎం వికారాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో గ్రామాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా పులుసుమామిడి వాగులో ఓ వ్యక్తి గల్లంతైయ్యాడు. సిద్ధులూర్ వైపు నుండి ద్విచక్రవాహనంపై వచ్చిన వ్యక్తి వాగు దాటే క్రమంలో తన బైకుతో సహా వాగులో కొట్టుకుపోయాడు. వాగు ప్రవాహం ఎక్కువ ఉందని హెచ్చరించిన లెక్కచేయకుండా వాగు దాటే ప్రయత్నం చేశాడు. అతడ్ని కాపాడానికి స్థానికులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ప్రస్తుతం ఆ వ్యక్తిని వెతికేందుకు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. వాగులో గల్లంతైన వ్యక్తికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published.