బీజేపీ నాయకులపై నిప్పులు చెరిగిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

బీజేపీ నాయకులపై నిప్పులు చెరిగిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటన చేస్తే అవగాహన లేకుండా బిజెపి నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.   కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పాత పెన్షన్ తీసివేస్తే సీఎం కేసీఆర్ పెన్షన్ స్కింను పునరుద్ధరణ చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని ఎందుకు కొనసాగించడం లేదు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 10 సంవత్సరాలకు ఒక్కసారి పీఆర్సీ ఇస్తున్నారు. ఆ పీఆర్సీ కూడా 10 శాతం 14 శాతం మాత్రమే ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే 14 శాతం ఇస్తున్నారు కానీ మా ప్రభుత్వం 73 శాతం పీఆర్సీ ఇచ్చింది. మీరూ పాలించే రాష్ట్రాల్లో బేసిక్ మన రాష్ట్రంలో ఎంత బేసిక్ ఉందొ మీరు గమనించాలి .మన పక్కన ఉన్న మహారాష్ట్రలో ఎంత బేసిక్ ఇచ్చారు ,అధికారంలోకి వస్తాం అని కొంత పెంచారు కానీ అది కూడా తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే తక్కువే. గుజరాత్ రాష్ట్రంలో కూడా 10 సంవత్సరాలలో ఒక్కసారి మాత్రమే ఇస్తున్నారు ఈ పీఆర్సీ ఎందుకు వాళ్ళు ఉద్యోగులు కారా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కు సమానంగా జీతం ఇవ్వాలని ఉమ్మడి రాష్ట్రంలో మేము పోరాటం చేసే వాళ్ళం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నాము. వాజపేయి గారు ఉన్నప్పుడు సీపీఎస్ రద్దు చేస్తే దాన్ని కొనసాగించారు కానీ మా ముఖ్యమంత్రి ఇవాళ సిపిఎస్ విధానము తీసేశారు. పాత పెన్షన్ స్కిం కొనసాగించారు. హోమ్ గార్డ్లకు దేశంలో ఎక్కడ లేనివిధంగా జీతాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ది మా ప్రభుత్వం ది. ఒకే నెలలో 32 వేల మందికి ప్రమోషన్ లు ఇచ్చిన ఘనత మా సీఎం కేసీఆర్ ది. మీరూ పరిపాలన చేసే రాష్ట్రాల్లో ఎంత ఇస్తున్నారు మిరూ చెప్పండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. జనాభా ప్రాతిపదికన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలతో చెప్పండి మేము చెప్పుతాం. ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు మా యువత కు ఇప్పిస్తాము. కేంద్ర ప్రభుత్వం సంవత్సరం కి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అన్నారు ఏమైంది ఇచ్చారా.ప్రధాని అంటే మేము గౌరవం ఇస్తాం మిలాగా అవహేళన చేసి మాట్లాడం. రాష్ట్రం తెచ్చిన నాయకుడు ని,ఎక్కువ మెజారిటి తో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి పై ఇలా మాట్లాడం సరైనపద్ధతి కాదు. కిషన్ రెడ్డి గారు మాట్లాడితే ఒక్క విధంగా హుందాగా ఉంటుంది. గత బీజేపీ నాయకులు హుందా తో మాట్లాడేవారు కానీ ఇప్పుడు నాయకులు పద్ధతి లేకుండా సంస్కరహీనంగా మాట్లాడుతున్నారూ. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్,ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్. అధికారంలోకి రావాలంటే రెచ్చగొట్టే మాటలు కాదు అభివృద్ధి కార్యక్రమాలు కావాలి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి. నిరుద్యోగ యువతకు నేను నమస్కరించి చెప్తున్న రానున్న రోజుల్లో మంచిరోజులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉన్న ఉద్యోగులను ఉడగొడుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. మన్మోహన్ సింగ్ అయంలోనే పాత పెన్షన్ విధానము ను తొలగించారు దానితో చాలా మంది పెన్షన్ దారులు రోడ్డున పడ్డారు. పీఆర్సీ కమిటీ 2018లో బిస్వాల్ కమిటీ 7.5 శాతం మాత్రమే ఇచ్చారు కానీ మా సీఎం కేసీఆర్ 30 శాతం పీఆర్సీ ఇచ్చారు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు

Leave a Reply

Your email address will not be published.