ద్విచక్ర వాహనాల ఢీ.. క్యాసారం గ్రామానికి చెందిన యువకుడు మృతి..

ద్విచక్ర వాహనాల ఢీ.. క్యాసారం గ్రామానికి చెందిన యువకుడు మృతి..

ఆర్.బి.ఎం క్యాసారం: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన ఘటన బిడిఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పటాన్చేర్ నియోజకవర్గంలోని క్యాసారం గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల నరేష్, మన్నే సాయి గ్రామం నుండి ఇస్నాపూర్ వెళ్లే మార్గంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ప్రమాదంలో పిచ్చకుంట్ల నరేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్రమైన గాయాలు కావడంతో స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.