చత్రపతి శివాజీ జయంతి ర్యాలీతో కాషాయమయమైన క్యాసారం గ్రామం..

చత్రపతి శివాజీ జయంతి ర్యాలీతో కాషాయమయమైన క్యాసారం గ్రామం..

ఆర్.బి.ఎం : ఛత్రపతి శివాజీ మహారాజ్ 393వ జయంతి వేడుకలను పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గం క్యాసారం గ్రామంలో చత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో యువత పాల్గొని గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.దీంతో క్యాసారం గ్రామం కాషాయమయమై ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

ఈ సందర్భంగా చత్రపతి శివాజీ యూత్ సభ్యులు మాట్లాడుతూ  శివాజీ ధీరత్వాన్ని కొనియాడారు. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు యావత్ భారతం వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే చత్రపతి శివాజీ జయంతి నేడు అని వారన్నారు. ప్రతి హిందువు ఛత్రపతి శివాజిని  ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్యాసారం గ్రామ పెద్దలు,యువత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.