దోమలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య..

దోమలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య..

ఆర్.బి.ఎం వికారాబాద్: వికారాబాద్ జిల్లా దోమ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ బొంపల్లి గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మతిస్థిమితం సరిగా లేక వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు ప్రభాకర్ వికారాబాద్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంపల్లి గ్రామవాసి. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఇదే విధంగా గతంలో కూడా రెండు సార్లు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు మృతుడి భార్య మాధవి పేర్కొంది. ఈ నేపథ్యంలో దోమ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.