మేడ్చల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కిక్కిరిసిన జనం
ఆర్.బి.ఎం మేడ్చల్: మరోనాలుగు రోజుల్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల సవరణ అమల్లోకి రానుండటంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రద్దీగా మారాయి. శుక్రవారం మేడ్చల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం క్రయవిక్రయదారులతో కిక్కిరిసిపోయింది. ఇప్పటికే భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోని వారు మీసేవా సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. స్లాట్ బుకింగ్ల సంఖ్య పెరగడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయం రద్దీగా మారింది.