ఈత సరదా..ప్రాణాలు తీసింది..

మేడ్చల్: కీసరలోని చిర్యాల్ గ్రామంలో విషాదం నెలకొంది. ఈత సరదా ముగ్గురు విద్యార్థుల ప్రాణం తీసింది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చిర్యాల్ నాట్కం చెరువులో మునిగి శవాలుగా తెలారు. బుధవారం హరహరన్, ఉబేద్ అనే ఇద్దరు విద్యార్థుల బర్త్ డే సందర్భంగా.. తొమ్మిది మంది విద్యార్థులు చిర్యాల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లారు. తిరిగి వెళ్లే సమయంలో సరదాగా ఈత కొట్టేందుకు చిర్యాల నాట్కం చెరువుకు వెళ్లారు. ఈత కొడుతుండగా ముగ్గురు విద్యార్థులు నాట్కం చెరువులో గల్లంతయ్యారు. మిగతా విద్యార్థులు చూస్తుండగానే ముగ్గురూ నీటిలో మునిగిపోయారు. విద్యార్థుల మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published.