మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..

ఆర్.బి.ఎం వికారాబాద్, పూడూరు, మీర్జాపూర్: వికారాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన. పూడూరు మండల పరిధిలోని మీర్జాపూర్ గ్రామంలో మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన చాకలి రవి, చింటు యాదవ్ అనే ఇద్దరు యువకులు బుధవారం రాత్రి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి అతిగా మద్యం సేవించిన చాకలి రవి, చింటు యాదవ్ లు బాలికను బలవంతంగా ఇంటి నుండి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయానికి లోనై గాలింపు చేపట్టారు. బాలిక కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న కొందరు గమనించి ఇద్దరు యువకులకు దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఎస్సై శ్రీశైలం ఘటనా స్థలానికి చేరుకుని బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చాకలి రవి, చింటు యాదవ్ లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్సై శ్రీశైలం వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published.