అతివేగానికి బాస్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి మృతి..

అతివేగానికి బాస్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి మృతి..

ఆర్.బి.ఎం వికారాబాద్: వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని బాస్పల్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను అతివేగంగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి బాస్పల్లి గ్రామానికి చెందిన మారుతీగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ ప్రమాదంలో మరో ఇద్దరు శ్రీనివాస్,నరేష్ లకు తీవ్రమైన గాయాలు కావడంతో స్థానికులు పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  పరిగి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.

Leave a Reply

Your email address will not be published.