మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పై అట్రాసిటీ కేసు నమోదు..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: మల్కాజిగిరి టీఆరెస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి హన్మంతరావును ఈ నెల 17న దళిత మహిళలు ప్రశ్నించగా మైనంపల్లి హన్మంతరావు దళిత మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని,వారిపై దాడికి పాల్పడ్డారని రమ్య అనే మహిళ పెట్ బషీరాబాద్ పోలీసులకు పిర్యాదు చేసింది. రమ్య ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.