బీజేపీ కోటిలింగలలో.. ఈటల రాజేందర్ ఒక బోడిలింగం:రేవంత్ రెడ్డి
ఆర్.బి.ఎం డెస్క్: హుజురాబాద్ దళిత బిడ్డలు అనుకుంటే కేసీఆర్ కు టీఆరెస్ పార్టీకి గుణపాఠం చెప్పే అవకాశం ఉందని మూడు చింతలపల్లిలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మ గౌరవ దీక్షలో రేవంత్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ లో జరగబోయే ఉప ఎన్నికల్లో టీఆరెస్ పార్టీ ఓటమిపాలైతే టీఆరెస్ ప్రభుత్వం ఏమి పడిపోదని,బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిస్తే నరేంద్ర మోడీ ప్రపంచానికి ప్రధానమంత్రి కాడని బీజేపీ కోటిలింగలలో ఈటల రాజేందర్ ఒక బోడిలింగం అవుతాడు కానీ రాష్ట్రానికి వచ్చేది ఏమి ఉండదని రేవంత్ రెడ్డి అన్నారు. ఈటల రాజేందర్ దళితుల భూములు, దేవుడి మాన్యాలు కబ్జా చేశాడని ఈటల రాజేందర్ గజ నెరగడు ఉరికంభం ఎక్కియాలి అన్న కేసీఆర్ బీజేపీ పార్టీలో ఈటల చేరగానే ఎందుకు నోరు మూసుకున్నాడని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.