వరద బాధితులకు ఆహారం అందజేసిన మాజీ ఉప్ప సర్పంచ్ కార్తీక్ గౌడ్..
ఆర్.బి.ఎం డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దమ్మాయిగూడలోని ముంపుకు గురైన పలు కాలనీల్లో మాజీ ఉప్ప సర్పంచ్ కార్తీక్ గౌడ్ ఈ రోజు (సోమవారం) రాత్రి పర్యటించారు. వరద భాదితుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న కార్తీక్ గౌడ్. వరద నీరు పూర్తిగా ఇంట్లోకి రావడంతో వంట చేసుకోవడానికి వీలు లేని వారికీ కార్తీక్ గౌడ్ ఆహార పొట్లాలను అందజేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వరద బాధితులకు అండగా ఉంటా అని కార్తీక్ గౌడ్ హామీ ఇచ్చారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో వరద బాధితుల కోసం కార్తీక్ గౌడ్ చేస్తున్న కృషిని చూసి యువత కూడా అయన అడుగులో అడుగేసి సహాయం చేస్తున్నారు.
మాజీ ఉప్ప సర్పంచ్ కార్తీక్ గౌడ్ మాట్లాడుతూ గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో పురాతన (మట్టిగోడల) ఇండ్లలో, భవనాలలో నివాసం ఉండే వారు, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకి వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కార్తీక్ గౌడ్ అన్నారు.