విజయపురి కాలని వాసులకు ఇబ్బంది కలిగించకండి : ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్

విజయపురి కాలని వాసులకు ఇబ్బంది కలిగించకండి : ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం: సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని విజయపురి కాలనీ వాసులకు ఇబ్బంది కలుగకుండా నివారించాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ దక్షిణ మధ్య రైల్వే అధికారులకు సూచించారు. సోమవారం ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య, ఇతర అధికారులకు లేఖలు రాశారు. విజయపురి కాలని నుంచి లాలాగూడ వైపు వెళ్ళే మార్గాన్ని రైల్వే అధికారులు ముసివేసిన్ నేపధ్యంలో కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పద్మారావు గౌడ్ తో సమావేశమై వివిధ అంశాల పై వినతి పత్రాన్ని అందించారు. దాంతో పద్మారావు గౌడ్ వెంటనే రైల్వే అధికారులకు లేఖలు పంపారు. రైల్వే స్థలాలను పరిరక్షించు కోవడంలో తాము కుడా సహకరిస్తామని, అయితే స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగేలా ప్రహరీ గోడలు నిర్మించి, అప్ప్రోచ్ రోడ్డును మూసివేయడం సరికాదని పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు. స్థానికుల అవసరాలను అధికార యంత్రాంగం గుర్తించాలని అయన సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసుకున్న ప్రహరీ గోడ గేటును వాహనాల రాకపోకలకు వీలుగా తెరిచి ఉంచాలని అయన కోరారు.

Leave a Reply

Your email address will not be published.