క్యాసారంలో సమయానికి బస్సులు రాక విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు..

క్యాసారంలో సమయానికి బస్సులు రాక విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు..

ఆర్.బి.ఎం క్యాసారం: లాక్ డౌన్ నేపథ్యంలో ఇండ్లకే పరిమితమైన విద్యార్థులు మళ్ళీ పాఠశాలలు, కళాశాలలు పునర్ ప్రారంభం అవ్వడంతో పాఠశాలల బాట పట్టారు. క్యాసారం గ్రామం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు ఆర్.టి.సి బస్సులు శాపంగా మారాయి. తమ స్కూల్ సమయానికి బస్సులు రాకపోవడంతో క్యాసారం నుండి శంకర్ పల్లి వెళ్ళవలసిన విద్యార్థులు ఓడిఎఫ్ వరకు కాలినడకన వెళ్తున్నారు.

ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. తమ గ్రామానికి విద్యార్థుల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్.టి.సి అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.