క్యాసారం శివార్లలో దొంగల బీభత్సం

క్యాసారం శివార్లలో దొంగల బీభత్సం..

ఆర్.బి.ఎం క్యాసారం: పటాన్ చేరు నియోజకవర్గం క్యాసారం గ్రామ శివార్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. రాత్రి అయితే చాలు గ్రామ ప్రజలు రోడ్లపైకి వెళ్లాలంటే తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు.

స్థానిక గ్రామ ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం కిర్బీ నుండి క్యాసారం గ్రామంలోకి వచ్చే మార్గంలో రాత్రి 11 గంటల సమయంలో అటుగా వచ్చే వాహనాలను కొందరు గుర్తు తెలియని దుండగులు వాహనాలు నిలిపి వాహనదారులను మాటల్లో పెట్టి వారి వద్ద ఉన్న మారణాయుధాలతో బెదిరింపులకు పాల్పడుతూ దుండగులు చెప్పిన విదంగా నగదు,బంగారం ఇవ్వకపోతే వాహనదారులపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో దుండగుల బారి నుండి తమకు రక్షణ కల్పించాలని గ్రామ ప్రజలు వాపోతున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published.