హస్తం గుర్తుతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ప్రమాదమే..!

హస్తం గుర్తుతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రమాదమే..!

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంటేనే కాంగ్రెస్‌ అన్న ముద్ర నల్లగొండ జిల్లాలో ప్రధానంగా మునుగోడులో పాతుకుపోయింది. మూడున్నరేళ్లుగా ఎమ్మెల్యేగా, గతంలో ఎంపీగా హస్తం గుర్తుపైనే రాజగోపాల్‌ గెలుపొందారు. అయితే హస్తం గుర్తే ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డితో పాటు బీజేపీ నేతలను కలవరపెడుతోంది. రాజగోపాల్‌రెడ్డి బలమైన అభ్యర్థి అయినప్పటికీ ఆయనకు పడే ఓట్లు హస్తం గుర్తుకే పడే అవకాశ ఉందని బీజేపీ నేతలు కలవరపడుతున్నారు. అందువల్ల కమలం పువ్వు గుర్తును పెద్దఎత్తున ఇంటింటికీ ప్రచారం చేయాలని ఆ పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు కొమ్ము కాసేందుకు అధికారులు వెనుకాడరని అందువల్ల అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. బీజేపీ ఓటర్లను జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంటుందని, ఈ అంశంలోనూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దసరా పండుగ తర్వాత మండలానికి ముగ్గురు చొప్పున బాధ్యత తీసుకున్న నేతలు స్థానికంగానే మకాం వేయాలని బీజేపీ అధిష్టానం సూచించింది. ప్రతి ఓటరునూ నాలుగుసార్లు కలవాలని మునుగోడు నేతలను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published.