కేసీఆర్కు సవాల్ విసిరిన షర్మిల..
మెదక్: టీఆర్ఎస్ పాలన అద్భుతం అని చెబుతున్న సీఎం కేసీఆర్ తనతో కలిసి ఒక రోజు పాదయాత్రకు రావాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సవాల్ చేశారు. పాదయాత్రకు వస్తే సమస్యలు ఉన్నాయో.. లేవో చూపిస్తామన్నారు. నిజంగానే ప్రజలకు సమస్యలు లేకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పి వెళ్లి పోతానని చెప్పారు. టీఆర్ఎస్ పాలనపై నమ్మకం ఉంటే తన సవాల్ను స్వీకరించాలన్నారు. ఒక వేళ సమస్యలు ఉంటే కేసీఆర్ రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఏం ఘనకార్యం చేశారని అవార్డులు తీసుకుంటున్నారని షర్మిల ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలకులకు అవార్డులు ఇవ్వాల్సింది ప్రజలని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలకిచ్చిన ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా ప్రజలను ముంచారని షర్మిల ఘాటుగా విమర్శించారు.