విమానంలో సాంకేతిక లోపం..

విమానంలో సాంకేతిక లోపం

శంషాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్హాపూర్‌ వెళ్లాల్సిన ఆలియాన్స్‌ విమానం సాంకేతిక లోపంతో రద్దయింది. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో అందోళనకు దిగారు. శనివారం ఉదయం 9.24గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి కోల్హాపూర్‌ వెళ్లాల్సిన ఆలియాన్స్‌ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఎయిర్‌లైన్స్‌ అధికారులు అప్రమత్తమై విమాన సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అప్పటికే ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రయాణికులను మధ్యాహ్నం 2గంటల వరకు వేచిఉండాలని ఎయిర్‌పోర్టు అధికారులు చెప్పారు. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. విమానంలో మరమ్మతులు పూర్తి కాకపోవడంతో విమానం రద్దయిందని చెప్పారు. దీంతో ప్రయాణికులు ఆందోళనను దిగారు. దిగొచ్చిన ఎయిర్‌లైన్స్‌ అధికారులు ప్రయాణికులను మరో విమానంలో వారివారి స్వస్థలాలకు పంపినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.