హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కదులుతున్న డొంక..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు విచారణలో పోలీసులు కీలక వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. మరో 15 మంది వ్యాపారవేత్త ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏడుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. వ్యాపారవేత్త గజేంద్ర విపులల కోసం టాస్క్ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు టోని దగ్గర నుంచి వ్యాపారవేత్తలు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. టోని 15 మందికి డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు తెలిపాడు. 15 మంది వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అయితే వీరందరికీ రాజకీయ పలుకుబడి ఉన్న బడా వ్యాపారవేత్తలని, విచారణకు ఆటకం ఏర్పడే పరిస్థితి ఉందని చెబుతున్నారు.