రాష్ట్రంలో కరోనా ఉధృతం.. గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులో తెలుసా?
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,801 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,47,155 కు కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 4,078 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 38,023 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 7,05,054 మంది కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,570 కరోనా కేసులు నమోదయ్యాయి.