హైదరాబాద్లో నేరేడ్ మెట్ ఘటన మరవక ముందే మరో ఘటన…

హైదరాబాద్లో నేరేడ్ మెట్ ఘటన మరవక ముందే మరో ఘటన…

హైదరాబాద్: కుండపోత వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులన్ని నదులను తలపిస్తున్నాయి. మొన్న నేరేడ్ మెట్ నాలాలో పడి ఒ పాప చనిపోయిన ఘటన మరవక ముందే హైదరాబాద్ లో మరో ఘటన చోటు చేసుకుంది. సరూర్ నగర్లోని ఓ కాలనీలో స్కూటీ పై వెళ్తున్న ఒ వ్యక్తి వరదలో స్కూటీతో సహా కొట్టుకుపోయాడు. 35 కాలనీలకు చెందిన వర్షపు నీరు మినీట్యాంక్ బండ్కు వెళ్లె క్రమంలో సరూర్‌నగర్ తపోవన్ కాలనీ వద్ద వర్షపు నీరు తీవ్రంగా ప్రవహిస్తోంది. భారీగా నీరు ప్రవహిస్తున్న ప్రాంతాని ఒ వ్యక్తి స్కూటిపై వచ్చి పక్కన కొద్ది సేప్పు అగాడు. వరద తివ్రతను గమనించని ఆ వ్యక్తి ఆ వరదను దాటే క్రమంలో స్కూటీతో పాటు వరదలో కొట్టుకుపోయాడు. స్థానికులు ఎంత ప్రయత్నించిన అతడ్ని కాపాడలేకపోయారు. స్థానికులు పోలీసులకు జీహేచ్ఎంసీ, సిబ్బందికి, అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

Leave a Reply

Your email address will not be published.