మత్తులో డ్రైవర్.. కొద్ది నిమిషాలకే దిమ్మతిరిగే షాక్

మత్తులో డ్రైవర్.. కొద్ది నిమిషాలకే దిమ్మతిరిగే షాక్

తాండూర్: ప్రభుత్వాలు మందు బాబులకు ఎన్ని నిబంధనలు పెట్టిన వాటిని తుంగలో తొక్కెందుకు మందు బాబులు ముందు వరుసలో ఉంటారు. మధ్యం సేవించి వాహనాలు నడుపుతు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా రోజుకు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నే ఉంటాయి అయిన కుడా మధ్యం సేవించి వాహనాలు నడపడం మనని పరిస్థితి. మధ్యం మత్తులో ఆటోను పోగోట్టుకున్న ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దెముల్ మండలం జయరాం తాండ గ్రామం దగ్గర హన్మాపూర్ నుంచి జినుగుర్తి పోయే దారిలో ఉన్న ఏరును దాటుతుండగా ఆటో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఎరులో కొట్టుకుపోయింది. స్థానికులు ఆటోలో ఉన్న ముగ్గురిని తాడు సహయంతో వారిని రక్షించారు. స్థానికులు ఎంత చెప్పిన వినకుండ వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. డ్రైవర్ రాముడు శంకర్ పల్లి మండలం తెల్లగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు