నగరంలో 45 అడుగుల భారీ దుర్గా మాత విగ్రహం..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: నగరంలోని ఎసమియా బజార్లో 45 అడుగుల దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారి భారీ విగ్రహాన్ని పర్యావరణంపై ఎలాంటి హానికరమైన ప్రభావం లేకుండా గడ్డి, బంకమట్టి, ఎర్ర ఇసుక, వాటర్ పెయింట్తో 20 మందికి పైగా కళాకారులు నెల రోజుల పాటు శ్రమించి బ్రహ్మాండమైన విగ్రహాన్ని రూపొందించారు. ఈ భారీ దుర్గా మాత విగ్రహానికి తొమ్మిది ముఖాలు,తొమ్మిది చేతులు ఉండే విధంగా రూపొందించారు. దుర్గా మాత విగ్రహాన్ని దర్శించుకునెందుకు నగర వ్యాప్తంగా భక్తులు ఆ ప్రాంతానికి తరలివస్తున్నారు.