దసరా ప్రజల జీవితాలలో కొత్త వెలుగులు నింపాలి: బి.జనార్దన్ రెడ్డి, చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి

దసరా ప్రజల జీవితాలలో కొత్త వెలుగులు నింపాలి..విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బి.జనార్దన్ రెడ్డి

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి అన్నారు. దుష్ట శిక్షణ, శిష్ఠ రక్షణలో ఆదిపరాశక్తి ప్రజలకు సదా స్ఫూర్తినిస్తుందని ఆయన తెలిపారు. పురాణాల ప్రకారం లోకమాత, ఆదిపరాశక్తి మహిషాసురుని అంతమొందించింది విజయదశమి రోజునేనని అందుకే విజయదశమి రోజున విజయానికి స్ఫూర్తిగా నవరాత్రులు అమ్మవారికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందని జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ విజయదశమి ప్రజల జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.అమ్మవారి దయతో కరోనా మహమ్మారి పూర్తిగా అంతమయి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు జనార్దన్ రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.