తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ లేవు: పద్మారావు గౌడ్ ఉప సభాపతి
ఆర్.బి.ఎం సికింద్రాబాద్: దేశంలోనే ఉన్నతమైన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని ఉప సభపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. మనికేశ్వరినగర్ ప్రాంతానికి చెందిన మల్లికా బేగం కు షాది ముబారక్ చెక్కును పద్మారావు గౌడ్ గురువారం సీతాఫలమండీ క్యాంపు కార్యాలయంలో అందించారు. తెరాస యువ నేత రామేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు దళారీలను ఆశ్రయించారదని, సీతాఫలమండీ లోని తమ కార్యాలయంలో ఉచిత సేవలు అందిస్తామని ఆయన తెలిపారు.