చిలకలగూడ కట్ట మైసమ్మ, నల్ల పోచమ్మ ఆలయాల ప్రారంభోత్సవం..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: చిలకలగూడ కట్ట మైసమ్మ, నల్ల పోచమ్మ ఆలయంలో ఆగస్టు ఒకటిన జరిగే బోనాల వేడుకలకు హాజరుకావాలని ఆలయ ఈఓ మహేందర్ గౌడ్ శాసన సభ ఉప సభాపతి టీ. పద్మరావు గౌడ్ ను ఆహ్వానించారు.అలాగే సికింద్రాబాద్ నియోజక వర్గం కార్పొరేటర్ లను మరియు నాయకులను కట్టమైసమ్మ గుడి నిర్వాహకులు ఆహ్వానించారు.సికింద్రాబాద్ అసెంబ్లి నియోజకవర్గం పరిధిలో చిలకలగూడ కట్టమైసమ్మ దేవాలయంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆగస్ట్ 01 తేదిన బోనాల వేడుకలు జరుగుతాయని వారు తెలియజేశారు. ఈ బోనాల వేడుకల ఏర్పాట్ల పై త్వరలో అన్ని విభాగాలతో ఓ సమన్వయ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సమాచారం.