ప్రజలందరూ వాక్సిన్ వేయించుకోవాలి: విక్రమ్ రెడ్డి, క్యాసారం గ్రామ ఉప్ప సర్పంచ్
ఆర్.బి.ఎం క్యాసారం: క్యాసారం గ్రామంలో ఏర్పాటు చేసిన వాక్సిన్ కేంద్రంలో గ్రామ ప్రజలందరూ వాక్సిన్ వేయించుకోవాలని ఉప్ప సర్పంచ్ విక్రమ్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ యావత్ ప్రపంచాని భయాందోళనకు గురిచేసిన కరోనా మహమ్మరిని ఎదుర్కొనేందుకు వాక్సిన్ ఆయుధం లాగా పని చేస్తుందని, వాక్సిన్ పై ఉన్న అపోహలను నమ్మొద్దని దైర్యంగా వాక్సిన్ తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రజలకు కరోనా వాక్సిన్ పై అవగాహన కోసం యువత ముందుకు రావాలని విక్రమ్ రెడ్డి పిలుపునిచ్చారు. కరోనా మహమ్మరి ఇంకా పూర్తిగా నశించలేదని ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం అయితేనే బహిరంగంగా ప్రదేశాలకు వెళ్లాలని, భౌతిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉప్ప సర్పంచ్ విక్రమ్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెంటయ్య,ఎంపిటిసి రాంచెందర్, గ్రామ పంచాయతీ సభ్యులు మెట్టి ఈశ్వరయ్య, విజయ, ఇంద్రజ, కో ఆప్షన్ మెంబర్ కె.శ్రీనివాస్ యాదవ్,సంగీత, దశరథ్, ఏ సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.