మదీనగూడాలో స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న హర్యానా గవర్నర్ దత్తాత్రేయ,చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ఇంచార్జి జనార్దన్ రెడ్డి..

మదీనగూడాలో స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న హర్యానా గవర్నర్ దత్తాత్రేయ,చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ఇంచార్జి జనార్దన్ రెడ్డి..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: మదీనగూడాలో మదర్స్ టచ్ ప్రీ స్కూల్ ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిధిగా హాజరై స్కూల్ ను ప్రారంభించారు. స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దత్తాత్రేయతో పాటు చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, శేరిలింగంపల్లి కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మియాపూర్ కార్పోరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, బిజెపి నేత జ్ఞానేంద్రప్రసాద్, శ్రీమతి కసిరెడ్డి సింధూ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్, బిజెపి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నాగులు గౌడ్, బిజెపి, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఇదివరకే ఈ సంస్థకు సంబంధించిన మూడు స్కూళ్లను కేంద్ర మంత్రి హోదాలో బండారు దత్తాత్రేయ ప్రారంభించారని, ఇప్పుడు హర్యానా గవర్నర్ హోదాలో నాల్గవ స్కూల్ ను ప్రారంభించారని జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారని అయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published.