నవంబర్‎లోనే మునుగోడు ఉప ఎన్నిక

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికపై ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణలో సునీల్ బన్సల్ శనివారం పర్యటించారు. మునుగోడు బై ఎలక్షన్ బీజేపీ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డితో పాటు, ఉప ఎన్నిక కోసం ఇప్ప‌టికే నియ‌మించిన స్టీరింగ్ క‌మిటీ స‌భ్యులు భేటీ అయ్యారు. ఈ భేటీలో బన్సల్ మాట్లాడుతూ.. నవంబర్ లో బై ఎలక్షన్ జరుగుతుందని బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జీ సునీల్ బ‌న్సల్ అన్నారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడిన సునీల్ బ‌న్స‌ల్‌.. న‌వంబ‌ర్ మొద‌టి వారంలో లేదంటే రెండో వారంలో మునుగోడు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంద‌ని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధించి తీరుతుంద‌ని ఆయ‌న అన్నారు. ఆయా మండ‌లాల ఇంచార్జీలుగా నియ‌మితులైన నేత‌లంతా నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉండాల‌ని ఆయ‌న సూచించారు.

Leave a Reply

Your email address will not be published.