హనుమకొండ: వీఆర్ఏ సంఘం నేతలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ హామీలు నెరవేర్చాలని వారు సీఎం కేసీఆర్ కి వినతి పత్రం అందించారు. వీఆర్ఏలు ఇచ్చిన ఫిర్యాదును విసిరి పారేశారు కేసీఆర్. ఏమ్ డ్రామాలు చేస్తున్నారంటూ.. వీఆర్ఏ సంఘం నేతలపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ సీనియర్ నేత అయిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి కేసీఆర్ వెళ్లిన నేపథ్యంలో ఆయన్ని వీఆర్ఏ సంఘం నాయకులు కలిసినప్పుడు ఈ సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి కాన్వాయ్ ముందు వీఆర్ఏలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వీఆర్ఏల ఆందోళనలతో సీఎం కేసీఆర్ కాన్వాయ్ దిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.