చండూరు: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీకి అమ్ముడు పోయాడని ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గంలోని 2.20 లక్షల మంది ఓటర్ల నమ్మకాన్ని, అభివృద్ధిని రాజగోపాల్రెడ్డి స్వలాభం కోసం రూ.22 వేల కోట్లకు అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. బ్రిటీష్ ప్రభుత్వానికి, నిజాం రజాకార్లకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినట్లు మునుగోడు ప్రాంత ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్రెడ్డి బీజీపీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. మునుగోడుకు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో రాజగోపాల్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని, అన్ని రంగాల్లో దేశంలో తొలిస్థానంలో నిలబెట్టిన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ రుణం తీర్చుకోవాలని ప్రజలను కోరారు.